Share News

TDP: తెలుగుదేశం పార్టీ కీలక ప్రకటన..

ABN , Publish Date - Jun 25 , 2024 | 09:09 PM

పార్లమెంట్ స్పీకర్‌ ఎన్నిక నేపథ్యంలో తెలుగుదేశం ‌ పార్టీ (Telugu Desam Party) విప్‌ జారీ చేసింది. పార్టీకి చెందిన 16 మంది లోక్‌సభ సభ్యులకు త్రీ లైన్‌ విప్‌ జారీ చేసింది. రేపు లోక్‌సభకు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ చీఫ్ విప్ జీఎం హరీష్ బాలయోగి (GM Harish Balayogi) పేర్కొన్నారు.

TDP: తెలుగుదేశం పార్టీ కీలక ప్రకటన..
Lavu Sri Krishna Devarayalu

ఢిల్లీ : పార్లమెంట్ స్పీకర్‌ ఎన్నిక నేపథ్యంలో తెలుగుదేశం ‌ పార్టీ (Telugu Desam Party) విప్‌ జారీ చేసింది. పార్టీకి చెందిన 16 మంది లోక్‌సభ సభ్యులకు త్రీ లైన్‌ విప్‌ జారీ చేసింది. రేపు లోక్‌సభకు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ చీఫ్ విప్ జీఎం హరీష్ బాలయోగి (GM Harish Balayogi) పేర్కొన్నారు. రేపు ఉదయం 11గంటల నుంచి తప్పక లోక్‌సభలో ఉండాలని , ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థికి ఓటు వేయాలని కూడా విప్‌లో పేర్కొన్నారు.


రేపు ఉదయం 9.30 గంటలకు టీడీపీపీ నేత లావు శ్రీ కృష్ణ దేవరాయలు (Lavu Sri Krishna Devarayalu) నేతృత్వంలో టీడీపీ ఎంపీల సమావేశం జరగనున్నది. సమావేశంలో స్పీకర్ ఎన్నికలో ఓటింగ్ విధానంపై ఎంపీలకు శ్రీకృష్ణ దేవరాయలు అవగాహన కల్పించనున్నారు. సమావేశం అనంతరం అందరూ కలిసి పార్లమెంట్‌కు టీడీపీ ఎంపీలు వెళ్లనున్నారు. ఏపీ బీజేపీ , జనసేన సభ్యులను కూడా సమావేశానికి టీడీపీ ఆహ్వానించనున్నది.

Updated Date - Jun 25 , 2024 | 09:34 PM