Home » MVV Satyanarayana
ఆంధ్రప్రదేశ్లో సైబర్ నేరాలు, ఎన్డిపిఎస్ కేసులతో పాటు ఇటీవల జరిగిన పారిశ్రామిక ప్రమాదాలకు సంబంధించిన కేసుల దర్యాప్తుపై సమీక్ష చేశామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతలకు అసలు విషయం తెలిసొచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పించిన నేతలు ప్రస్తుతం స్వరం మార్చారు.
సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగారు. సోమవారం నాడు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక్కడి వరకూ అంతా ఓకేగానీ.. ఎక్కడో తేడా కొట్టినట్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తోందనే అనుమానాలు వైసీపీ క్యాడర్లో గట్టిగానే వస్తున్నాయ్. ఇందుకు కారణం..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తాము అందరం షాక్లోకి వెళ్లి పోయామని విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (MVV Satyanarayana) వ్యాఖ్యానించారు. తనపై తప్పుడు వార్తలు రావడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖ: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. హయగ్రీవ సంస్థ భూముల వ్యవహారంలో మాజీ ఎంపీపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు (MVV Satyanarayana) ఏపీ హైకోర్టులో(AP High Court) ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు తెలిపింది.
విశాఖలో విలువైన భూములను వైసీపీ నాయకులు కబ్జాలు చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆరోపించారు. సీబీసీఎన్సీ క్రైస్తవ భూములలో కేఏ పాల్, బాబు మోహన్ సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎంవీవీ సత్యనారాయణ మనసు మార్చుకొని లాండ్స్ని బాపిస్ట్ సంఘాలకు సంబంధించిన యాజమాన్యానికి అప్పగించాలంటూ కేఏ పాల్ ప్రార్థన చేశారు.
Andhrapradesh: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని వైఎస్సార్సీపీ సన్నాహాలు చేస్తోంది. ఓ వైపు సిద్దం అంటూ సభలు పెడుతూనే.. మరోవైపు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయాలని యత్నిస్తోంది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ప్రలోభాల పర్వానికి తెరతీసింది. గత రెండు రోజుల నుంచి ఓటర్లకు చీరల పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అధికార పార్టీ శతవిధాలుగా ప్రయత్నాలు చేపట్టింది.
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కౌంటర్ ఇచ్చారు. భూ భక్షకుడు ఎంవీవీ అని విమర్శించారు. అనేక కుంభకోణాల్లో ఆయన హస్తముందన్నారు. ఎంవీవీ భూకబ్జాలకు పాల్పడ్డారని స్వయానా విజయసాయి రెడ్డి గతంలో అన్న విషయాన్ని గుర్తు చేశారు. విశాఖలో వ్యాపారం చేయబోనని.. హైదరాబాద్ వెళతానన్న ఎంవీవీ మాట ఏమైందని ప్రశ్నించారు.
టీడీపీ - జనసేన కలవడం అనేది కొత్త కాదని.. తాను ఎప్పటి నుండో చెప్తున్నానని ఎంపీ ఎంవీవి సత్యనారాయణ ఎంపీ అన్నారు.