Share News

YSRCP: విశాఖలో వైసీపీ ప్రలోభాల పర్వం.. ఓటరు జాబితా పెట్టుకుని మరీ..

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:54 PM

Andhrapradesh: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని వైఎస్సార్సీపీ సన్నాహాలు చేస్తోంది. ఓ వైపు సిద్దం అంటూ సభలు పెడుతూనే.. మరోవైపు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయాలని యత్నిస్తోంది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ప్రలోభాల పర్వానికి తెరతీసింది. గత రెండు రోజుల నుంచి ఓటర్లకు చీరల పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అధికార పార్టీ శతవిధాలుగా ప్రయత్నాలు చేపట్టింది.

YSRCP: విశాఖలో వైసీపీ ప్రలోభాల పర్వం.. ఓటరు జాబితా పెట్టుకుని మరీ..

విశాఖపట్నం, మార్చి 1: రాష్ట్రంలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న వేళ మరోసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని వైఎస్సార్సీపీ (YSRCP) సన్నాహాలు చేస్తోంది. ఓ వైపు సిద్దం అంటూ సభలు పెడుతూనే.. మరోవైపు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయాలని యత్నిస్తోంది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ప్రలోభాల పర్వానికి తెరతీసింది. గత రెండు రోజుల నుంచి ఓటర్లకు చీరల పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అధికార పార్టీ శతవిధాలుగా ప్రయత్నాలు చేపట్టింది. ఓటరు జాబితాను దగ్గర పెట్టుకొని మరీ వైసీపీ కార్యకర్తలు చీరలు పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా ఇందుకు వాలంటీర్లు (Volunteers) పూర్తి సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు.

తూర్పు నియోజకర్గం సమన్వయ కర్తగా ఎంవీవీ సత్యనారాయణ (MVV Satyanarayana) బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఓటర్లకు ముందస్తు ప్రలోభాలకు పూనుకున్నారు. కొన్ని నెలల కిందటే పండగ సందర్భంగా ఇంటికి ఎంవీవీ సత్యనారాయణ పేరుతో స్వీట్ ప్యాకెట్లు పంపిణీ అయ్యాయి. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎంవీవీ సత్యనారాయణ చీరలు పంపిణీ చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

AP Politics: జగన్ రాక ఆలస్యం.. మహిళల అసహనం


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 01 , 2024 | 12:54 PM