Home » Panchayat Raj Department
చిల్లకూరు మండలం మోమిడి పంచాయతీకి జాతీయస్థాయి ఉత్తమ అవార్డు లభించింది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న గ్రామాలు సమీప పురపాలికల్లో విలీనం అయ్యాయి. దీంతో రేవంత్ సర్కారు తలపెట్టిన ‘మహా హైదరాబాద్’లో కీలక అడుగు పడినట్లయింది.
బి.కొత్తకోట మండలం బీరంగి పంచాయతీ పరిధిలో నిర్మిత మైన పెయింటర్స్ కాలనీని బి.కొత్తకోట నగరపంచాయ తీ పరిధిలోనే కొనసాగించాలని ఆ కాలనీవాసులు, సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కొత్త సంవత్సరంలో జరగనున్నాయి. జనవరిలో ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.
కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయాలను సమర్ధవంతంగా పనిచేయించడం మొదలైంది. గాడిలో పెట్టే దిశగా ఇప్పటికే సీఎం చంద్రబాబు అత్యున్నత స్థాయి సమావేశంలో కూడా ప్రస్తావించారు.
పల్లెలకు కాసుల కళ వచ్చింది. గత ప్రభుత్వం దారి మళ్లించిన ఆర్థిక సంఘం నిధులను తాజాగా పంచాయతీ ఖాతాలకు జమ చేశారు. ఈ మేరకు జిల్లాకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.29.24 కోట్లు జనాభా ప్రాతిపదికన విడుదలయ్యాయి. ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవడంతో పంచాయతీలకు నిధులొచ్చాయి.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాబోయే ఐదేళ్లలో 17,500 కి.మీ మేర సిమెంటు రోడ్ల నిర్మాణం..
జెండా పండగ కోసం ఐదువేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 10వేలు, అంతకుమించితే రూ.25 వేలను సాధారణ నిధుల నుంచి వాడుకోవడానికి అనుమతి ఇచ్చారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన ప్రాథమిక కసరత్తును రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం ప్రారంభించింది.
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు రూ.29,816 కోట్లు కేటాయించింది. 2023-24లో ఈ శాఖకు కేటాయించిన రూ.31,426 కోట్లతో పోల్చితే ఈసారి రూ.1,610 కోట్లు తగ్గింది.