Home » Vande Bharat Trains
ప్రధాని మోదీ ప్రారంభించిన నాగపూర్-సికింద్రాబాద్ వందేభారత్ రైలు శనివారం అర్ధరాత్రి సికింద్రాబాద్ చేరింది.
వందేభారత్ రైలు కాంట్రాక్టుపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే సోమవారంనాడు సంచలన ఆరోపణ చేశారు. అయితే కొద్దిసేపటికే రైల్వే మంత్రిత్వ శాఖ దీనికి కౌంటర్ ఇచ్చింది.
వందే మెట్రో సర్వీస్ పేరును "నమో భారత్ ర్యాపిడ్ రైల్"గా మారుస్తూ భారతీయ రైల్వే అధికారిక ప్రకటన జారీ చేసింది. గుజరాత్లోని భుజ్-అహ్మదాబాద్ వందే మెట్రో ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు పేరు మార్పు జరిగింది.
ఈరోజు 6 కొత్త వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ(narendra Modi) జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్ల నిర్వహణ వల్ల కనెక్టివిటీ, సురక్షిత ప్రయాణం, ప్రయాణికులకు సౌకర్యాలు పెరుగుతాయి. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త వందేభారత్ రైలు నిర్వహణతో వాటి సంఖ్య 54 నుంచి 60కి పెరుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
దేశంలోని ప్రప్రథమ వందేభారత్ మెట్రో రైలును ప్రధాని మోదీ సోమవారం ఇక్కడ ప్రారంభించనున్నారు. ఇది అహ్మదాబాద్-భుజ్ల మధ్య తిరగనుంది.
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు కొత్త వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
వందేభారత్ స్లీపర్ ట్రైన్ కోసం బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎంఎల్) కంపెనీలో తయారు చేస్తున్న బోగీల నమూనా ఫొటోలను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం విడుదల చేశారు.
భారతీయ రైల్వేలు ఇప్పుడు సెమీ హై స్పీడ్ వందే భారత్ రైలు స్లీపర్ వెర్షన్ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం (సెప్టెంబర్ 1) వందే భారత్ స్లీపర్ రైలు మొదటి మోడల్ ప్రోటోటైప్ వెర్షన్ను ఆవిష్కరించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వెంబడి కెనెక్టివిటీని మరింత పెంచే మూడు వందే భారత్ రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారంనాడు ప్రారంభించారు. మీరట్ సిటీ-లక్నో, మధురై-బెంగళూరు, చెన్నై ఎగ్మోర్-నాగర్కోయిల్ మధ్య ప్రయాణించే ఈ కొత్త రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రారంభించినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
వందేభారత్ రైలు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆ రైలు వల్ల ఎవరికీ ఎలాంటి అపాయం కలుగలేదు. సిబ్బంది చెంప మాత్రం చల్లుమంది. అందుకు కారణం.. వెజ్ ఫుడ్కి బదులు నాన్ వెజ్ సర్వ్ చేయడం. తొందరలో ఫుడ్ ఆర్డర్ చూసుకోక పోవడం అతని పాలిట శాపంగా మారింది. ఫుడ్ తిన్న కస్టమర్ కోపం నషాళానికి ఎక్కింది. వెంటనే సిబ్బందిపై చేయి చేసుకున్నాడు. ఆ రైలులో ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీశారు.