వచ్చే అక్టోబరుకల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎ్స)లోని మొదటి దశలో రెండు యూనిట్లు(ఒక్కోటి 800 మెగావాట్లు) పూర్తి కావాలని ఇంధన శాఖ కార్యదర్శి, జెన్కో సీఎండీ రొనాల్డ్రాస్ ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసమే బడ్జెట్లో నిధులు కేటాయించి ఆర్టీసీని గాలికి వదిలేసిందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. బాబు, ఈ. వెంకన్న విమర్శించారు.
కార్గిల్ యుద్ధాన్ని భారత్ గెలిచి పాతికేళ్లు అవుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
కిరాణా దుకాణం నడుపుతున్న మహిళ మెడలోంచి పుస్తెల తాడు కొట్టేసేందుకు యత్నించి ఇద్దరు దొంగలు అడ్డంగా బుక్కయ్యారు. అంతకు ముందు ఆమె దుకాణంలో సిగరెట్లు కొని.. చేసిన పేటీఎం చెల్లింపు వారి వివరాలను బట్టబయలు చేసింది.
నకిలీ పురుగుమందులను అరికట్టకపోతే ప్రజారోగ్యానికి, పంట భూములకు తీవ్ర నష్టం జరుగుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నకిలీ పురుగుమందులను కట్టడి చేసేందుకు ఏయే చర్యలు తీసుకుంటున్నారో వివరణ ఇవ్వాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖ, ఆరోగ్య భద్రతా విభాగం, రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది.
‘‘స్విస్ చాక్లెట్ లేదంటే బెల్జియన్ చాక్లెట్స్ మాత్రమే అత్యుత్తమం’’ అని చాలామంది అనుకుంటారు! కానీ.. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా రైతులు పండించిన కోకోతో ప్రపంచం మెచ్చే చాక్లెట్లను రూపొందించి సంచలనం సృష్టించిన హైదరాబాదీ ‘మనం చాక్లెట్స్’ సంస్థ ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి పొందింది.
కృష్ణా పరిధిలో ఎగువన వర్షాలు, వరదలతో నది పరిధిలోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. కొన్ని రోజులుగా ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ వచ్చేసింది.
గత ప్రభుత్వం దురుద్దేశంతో హైదరాబాద్ రోడ్ డెవల్పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్)ను ఏర్పాటు చేసిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్జీజీ) అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి ఆరోపించారు.
ప్రభుత్వ గ్యారెంటీ అప్పులపై కేంద్రం ఆంక్షలు కొనసాగుతోన్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో ఓ ప్రభుత్వ రంగ సంస్థకు రుణం లభించనుంది. తెలంగాణ సహకార అపెక్స్ బ్యాంక్(టీజీక్యాబ్)కు రూ.5000 కోట్ల రుణం ఇచ్చేందుకు జాతీయ సహకారాభివృద్ధి సంస్థ(ఎన్సీడీసీ) అంగీకరించింది.
రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశలో సీట్లు పొందిన వారిలో ఎక్కువ మంది కాలేజీల్లో చేరలేదు. దీంతో 22,753 సీట్లు మిగిలిపోయాయి.