Bharath jodo yatra: కొత్తూరులో రాహుల్ పాదయాత్రకు విరామం

ABN , First Publish Date - 2022-10-31T10:54:23+05:30 IST

ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ఆరో రోజు కొనసాగుతోంది.

Bharath jodo yatra: కొత్తూరులో రాహుల్ పాదయాత్రకు విరామం

రంగారెడ్డి: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) భారత్ జోడో యాత్ర (Bharath jodo yatra) తెలంగాణలో ఆరో రోజు కొనసాగుతోంది. షాద్‌నగర్ నుండి కొత్తూరు వరకు 13 కిలోమీటర్ల వరకు పాదయాత్ర సాగింది. కాగా... కొత్తూరు వద్ద పాదయాత్రకు విరామం ప్రకటించారు. విరామ సమయంలో రాహుల్ (AICC Leader) మీడియాతో మాట్లాడానున్నారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభంకానుంది. శంషాబాద్ ముచ్చింతల వద్ద కార్నర్ మీటింగ్ జరుగనుంది. ఈ రోజు రాత్రి తుండుపల్లిలో రాహుల్ గాంధీ బస చేయనున్నారు.

Updated Date - 2022-10-31T10:58:41+05:30 IST