Chandrababu: అనంతపురంజిల్లాలో చంద్రబాబు పర్యటన.. ప్రాజెక్టుల సందర్శన

ABN , First Publish Date - 2023-08-03T16:02:06+05:30 IST

జీడిపల్లి అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు దగ్గర నిలిచిపోయిన పనులను టీడీపీ అధినేత చంద్రబాబు పరిశీలించారు. చంద్రబాబును చూసేందుకు ప్రాజెక్టు దగ్గరకు పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు.

Chandrababu: అనంతపురంజిల్లాలో చంద్రబాబు పర్యటన.. ప్రాజెక్టుల సందర్శన

అనంతపురం: జీడిపల్లి అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు దగ్గర నిలిచిపోయిన పనులను టీడీపీ అధినేత చంద్రబాబు (chandrababu) పరిశీలించారు. చంద్రబాబును చూసేందుకు ప్రాజెక్టు దగ్గరకు పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. కొండలు, గుట్టలు ఎక్కి మరీ చంద్రబాబు కోసం రెండు గంటల పాటు అన్నదాతలు ఎదురుచూశారు. సీఎం జగన్ చర్యల వల్ల రైతాంగం పూర్తిగా నష్టపోయిందని చంద్రబాబు ముందు కర్షకులు గోడు వెళ్లబుచ్చుకున్నారు. అనంతరం రాప్తాడు నియోజకవర్గం నుంచి కియా పరిశ్రమ దగ్గర చంద్రబాబు బయల్దేరి వెళ్లారు. కాసేపట్లో కియా పరిశ్రమ దగ్గర సెల్ఫీ దిగనున్నారు. చంద్రబాబు వల్లే ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గానికి కియా పరిశ్రమ వచ్చింది.

Updated Date - 2023-08-03T16:02:12+05:30 IST