Share News

YCP: ‘అంబటి రాంబాబుకు ఈసారి సీట్ ఇస్తే ఓడించి తీరుతాం’

ABN , Publish Date - Dec 29 , 2023 | 09:35 AM

అమరావతి: సత్తెనపల్లి నియోజకవర్గ అసమ్మతి వైసీపీ నేతలు మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘అంబటి రాంబాబు వద్దు... జగనన్నే ముద్దు’ అంటూ తాడేపల్లి ఎంపీ విజయ్ సాయి రెడ్డి నివాసం ముందు ఆందోళన చేపట్టారు.

YCP: ‘అంబటి రాంబాబుకు ఈసారి సీట్ ఇస్తే ఓడించి తీరుతాం’

అమరావతి: సత్తెనపల్లి నియోజకవర్గ అసమ్మతి వైసీపీ నేతలు మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘అంబటి రాంబాబు వద్దు... జగనన్నే ముద్దు’ అంటూ తాడేపల్లి ఎంపీ విజయ్ సాయి రెడ్డి నివాసం ముందు ఆందోళన చేపట్టారు. అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా విజయ్ సాయి రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ నేతలు నిరసన తెలిపారు. మంత్రి అంబటి ప్రతి గ్రామంలో వైసీపీలోనే రెండు ముఠాలు ఏర్పాటు చేసి కక్షలకు కారణమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కూడా అంబటి రాంబాబు సొంత పార్టీ నేతలను అరెస్ట్ చేయించి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అంబటి రాంబాబుకు ఈసారి సీట్ ఇస్తే ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. సత్తెనపల్లి సీటు ఈసారి స్థానికులకే ఇవ్వాలని సత్తెనపల్లి వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - Dec 29 , 2023 | 09:35 AM