AP News: ఆదోని రైల్వే స్టేషన్ మాస్టర్ నిర్లక్ష్యం.. సంకటంగా ప్రయాణికుల ప్రాణాలు

ABN , First Publish Date - 2023-07-26T00:17:27+05:30 IST

కొంతమంది రైల్వే సిబ్బంది(Railway staff) నిర్లక్ష్యంతో ప్రయాణికులు(Passengers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

AP News: ఆదోని రైల్వే స్టేషన్ మాస్టర్ నిర్లక్ష్యం.. సంకటంగా ప్రయాణికుల ప్రాణాలు

కర్నూలు(Kurnool): కొంతమంది రైల్వే సిబ్బంది(Railway staff) నిర్లక్ష్యంతో ప్రయాణికులు(Passengers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే సిబ్బంది అలసత్వంతో అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతున్న అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఫలితంగా ప్రయాణికులకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా ఆదోని రైల్వే స్టేషన్ మాస్టర్(Adoni Railway Station Master) నిర్లక్ష్యంతో ప్రయాణికులు నిండు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగు పరుగున వెళ్లి ట్రైన్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. 22179 రైలు ముంబై(Mumbai) నుంచి కన్యాకుమారి(Kanyakumari)కి వెళ్తుంది. అయితే రైలును రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై ఆపకుండా ప్లాట్‌ఫాం చివరన ఆపడంతో ప్రయాణికులు తిప్పలు పడాల్సి వచ్చింది.ఒకటో నెంబర్ ప్లాట్‌ఫాం చివరన రైలును ఆపడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ రైలు ఎక్కాల్సి వచ్చింది.

Updated Date - 2023-07-26T05:00:54+05:30 IST