Share News

Botsa Satyanarayana: చంద్రబాబుకి అనారోగ్యం అయితే కోర్టులో పిటీషన్ వేయాలి

ABN , First Publish Date - 2023-10-14T17:43:25+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu)కి అనారోగ్యం పాలయితే కోర్టులో పిటీషన్ వేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) పేర్కొన్నారు.

Botsa Satyanarayana: చంద్రబాబుకి అనారోగ్యం అయితే కోర్టులో పిటీషన్ వేయాలి

విజయనగరం: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)కి అనారోగ్యం పాలయితే కోర్టులో పిటీషన్ వేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) పేర్కొన్నారు. శనివారం నాడు మంత్రి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘చంద్రబాబుకి అనారోగ్యమని నాకు ఫోన్లు చేయిస్తూ చీప్ ట్రిక్స్ ప్లే చేయిస్తున్నారు. చంద్రబాబు తప్పు చేశారన్న ఆధారాలతోనే రిమాండ్‌లో ఉన్నారు. తప్పు చేయలేదనుకుంటే కోర్టులో నిరూపించుకోవాలి. విశాఖపట్నంకు రాజధాని తరలింపుపై మీడియా సమాధానాలు అడిగితే దాట వేశారు. విశాఖకు మైన్ గేటు నుండే వస్తాం. దొడ్డి దారిన రావలిసిన అవసరం మాకు లేదు’’ అని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Updated Date - 2023-10-14T17:43:56+05:30 IST