Ashok Gajapathi Raju: ప్రాథమిక హక్కులు ఆంధ్రాలో అసలు ఉన్నాయా?

ABN , First Publish Date - 2023-10-02T13:06:18+05:30 IST

ఐఎఎస్, ఐపీఎస్‌లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని కేంద్రం ఒక్క మాట చెబితే ఐదు నిమిషాల్లో పరిస్థితి అంతా చక్కబడిపోతుంది.

Ashok Gajapathi Raju: ప్రాథమిక హక్కులు ఆంధ్రాలో అసలు ఉన్నాయా?

విజయనగరం: ప్రాథమిక హక్కులు ఆంధ్రాలో అసలు ఉన్నాయా? అంటూ టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఐఎఎస్, ఐపీఎస్‌లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని కేంద్రం ఒక్క మాట చెబితే ఐదు నిమిషాల్లో పరిస్థితి అంతా చక్కబడిపోతుంది. రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నా కేంద్రం ఎందుకు మౌనం వహిస్తుందో?, చంద్రబాబు (Chandrababu) ఏ నేరం చేశారన్నది ఓ వైపు మెజిస్ట్రేట్ చెప్పలేకపోతుంటే.. రిమాండ్ ఇంకా ఇంకా పొడిగించండని కోరడం అధికారులకు బుద్ధి ఉందా?, గుడికి వెళ్లి దేవుడికి దండం పెట్టడానికి కూడా పోలీసులు వెళ్లనీయటం లేదు.’’ అని మండిపడ్డారు.

Updated Date - 2023-10-02T13:06:18+05:30 IST