Crime: తనతో స్నేహం చేయకుంటే యాసిడ్ దాడి చేస్తానని మహిళకు బెదిరింపులు

ABN , First Publish Date - 2023-08-29T18:00:53+05:30 IST

తనతో స్నేహం చేయకుంటే యాసిడ్ దాడి చేస్తానని యువతిని బెదిరించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ప్రథమ్ గుప్తాగా గుర్తించారు.

Crime: తనతో స్నేహం చేయకుంటే యాసిడ్ దాడి చేస్తానని మహిళకు బెదిరింపులు

లక్నో: తనతో స్నేహం చేయకుంటే యాసిడ్ దాడి చేస్తానని యువతిని బెదిరించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ప్రథమ్ గుప్తాగా గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌‌కు చెందిన ప్రథమ్ గుప్తా అనే నిందితుడు ఒక అమ్మాయిని తనతో స్నేహం చేయాలని బలవంతపెట్టాడు. తనతో స్నేహం చేయకుంటే యాసిడ్ దాడి చేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన యువతి కాలేజీకి పోవడం కూడా మానేసి ఇంటి దగ్గరే ఉండిపోయింది. ఆ తర్వాత వారి మామ వాళ్ల ఇంటికి వెళ్లింది. యువతి ఫోన్ నంబర్ సంపాదించిన ప్రథమ్ గుప్తా తరచుగా కాల్స్ చేస్తూ ఇబ్బంది పెట్టాడు. యువతి ఫోటోలు కూడా తీశాడు. ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆమె తండ్రికి, బంధువులకు పంపిచాడు. ఆ యువతి తండ్రితో తన బాధను చెప్పుకుంది. దీంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ప్రథమ్ గుప్తాను అరెస్ట్ చేశారు. యాసిడ్ దాడి చేస్తానని బెదిరించిన ప్రథమ్ గుప్తాను యువతి తండ్రి ఫిర్యాదు ఆధారంగా అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ సంతోష్ సింగ్ తెలిపారు.

Updated Date - 2023-08-29T18:00:59+05:30 IST