PM Modi: రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈజిప్ట్ చేరుకున్న ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2023-06-24T19:42:00+05:30 IST

ఈజిప్టు (Egypt) అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ఆహ్వానం మేరకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం కైరో చేరుకున్నారు.

PM Modi: రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈజిప్ట్ చేరుకున్న ప్రధాని మోదీ

కైరో: ఈజిప్టు (Egypt) అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ఆహ్వానం మేరకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం కైరో చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఈజిప్ట్ ప్రధాని మోస్తఫా మడ్‌బౌలీ (Prime Minister Mostafa Madbouly) సాదరంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు. ఇక్కడికి చేరుకున్న ప్రధాని మోదీ గార్డ్ ఆఫ్ హానర్‌ను పరిశీలించారు. 26 ఏళ్లలో భారత ప్రధాని ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ ఆదివారం ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసితో సమావేశం కానున్నారు.

Updated Date - 2023-06-24T19:42:27+05:30 IST