Share News

Shashikala: జయలలిత నెచ్చెలి శశికళ ఆసక్తికర కామెంట్స్.. నేనిప్పుడు ఆ పని మీదే ఉన్నాగా...

ABN , First Publish Date - 2023-10-19T12:14:03+05:30 IST

అన్నాడీఎంకేలో విడిపోయిన అన్ని వర్గాలను సమైక్యపరచడమే తన ప్రధాన కర్తవ్యమని, ఆ దిశగానే తాను ముమ్మర ప్రయత్నాలు

Shashikala: జయలలిత నెచ్చెలి శశికళ ఆసక్తికర కామెంట్స్.. నేనిప్పుడు ఆ పని మీదే ఉన్నాగా...

చెన్నై, (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకేలో విడిపోయిన అన్ని వర్గాలను సమైక్యపరచడమే తన ప్రధాన కర్తవ్యమని, ఆ దిశగానే తాను ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నానని ఆ పార్టీ అసమ్మతి వర్గం నాయకురాలు శశికళ(Shashikala) అన్నారు. అన్నాడీఎంకే 52వ వార్షికోత్సవాల సందర్భంగా వేళచ్చేరిలో మంగళవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ మాజీ ముఖ్యమంత్రుల ఎంజీఆర్‌, జయలలిత పెంచి పోషించిన అన్నాడీఎంకే(AIADMK) ప్రస్తుతం ముక్కలవడం ఆవేదన కల్గిస్తోందన్నారు. అన్నాడీఎంకేలో చీలికలు ఉండటంతో ఎన్నికల్లో సులువుగా గెలుస్తామని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) పగటి కలలు కంటున్నారని, లోక్‌సభ ఎన్నికలలోపే అన్ని వర్గాలను కలిపి సమైక్య అన్నాడీఎంకేని బరిలోకి దింపి తీరుతానని శశికళ శపథం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకే ప్రకటించిన హామీలను నెరవేర్చలేదని, ప్రజలంతా ఆ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారని, ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ఘనవిజయం సాధిస్తుందన్నారు.

nani9.2.jpg

Updated Date - 2023-10-19T12:14:03+05:30 IST