![](/assets/images/redPulseDot.gif)
PM Modi Speech: ఈ ఎన్నికల్లో కేసీఆర్కు ప్రజలు పూర్తి సినిమా చూపిస్తారు: మోదీ
ABN , First Publish Date - 2023-11-27T15:44:31+05:30 IST
కరీంనగర్లో బీజేపీ సకలజనుల విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి భారత్ దేశం పుట్టిల్లు అని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
![PM Modi Speech: ఈ ఎన్నికల్లో కేసీఆర్కు ప్రజలు పూర్తి సినిమా చూపిస్తారు: మోదీ](https://media.andhrajyothy.com/media/2023/20231102/PM_Modi_f864026a6e.jpg)
Live News & Update
-
2023-11-26T15:58:00+05:30
పీవీ నరసింహరావుని కాంగ్రెస్ పార్టీ ప్రతి అడుగులో అవమానించిందని హస్తం పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు.
-
2023-11-26T15:56:00+05:30
తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ సర్కార్లు అవసరం లేదు
గ్యారెంటీలను నెరవేర్చే మోదీ సర్కార్ అవసరం
మోదీ గ్యారెంటీ అంటే అందరికీ ఉచిత వైద్యం
మోదీ గ్యారెంటీ అంటే అందరికీ ఆరోగ్యం
మోదీ గ్యారెంటీ అంటే రైతులకు చేయూత
ప్రజా సంక్షేమమే బీజేపీ ప్రాధాన్యత
ఓ వైపు కేసీఆర్ ఉన్నారు.. మరో వైపు మీ సేవకుడు మోదీ ఉన్నాడు
-
2023-11-26T15:42:00+05:30
PM Modi Speech Live Updates: కరీంనగర్లో బీజేపీ సకలజనుల విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి భారత్ దేశం పుట్టిల్లు అని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
‘‘ ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆట ముగియనుంది. మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతోంది. తెలంగాణ బీజేపీ తొలి సీఎం బీసీయే అవుతారు. చరిత్రలో 16 మహాజనపదాల్లో అస్మక జనపదం ఈ ప్రాంతం. హుజూరాబాద్ ఉపఎన్నికతో కేసీఆర్కు ట్రైలర్ చూపించాం. ఈ ఎన్నికల్లో కేసీఆర్కు ప్రజలు పూర్తి సినిమా చూపిస్తారు’’ అని ప్రధాని మోదీ అన్నారు.