Share News

Revanth Reddy: హైదరాబాద్‌లో రేవంత్ ఏ కాలేజీలో చదివారంటే..!

ABN , First Publish Date - 2023-12-07T11:58:56+05:30 IST

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న రేవంత్‌రెడ్డి (Revanth Reddy) డిగ్రీ విద్యాభ్యాసం నగరంలోనే సాగింది. 1989లో

Revanth Reddy: హైదరాబాద్‌లో రేవంత్ ఏ కాలేజీలో చదివారంటే..!

కవాడిగూడ, డిసెంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న రేవంత్‌రెడ్డి (Revanth Reddy) డిగ్రీ విద్యాభ్యాసం నగరంలోనే సాగింది. 1989లో దోమలగూడ ఏవీ కళాశాలలో బీఏఈపీపీ గ్రూప్‌లో చేరారు. మూడేళ్లపాటు ఇదే కళాశాలలో చదివారు. ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుడిగా విద్యారంగ సమస్యలపై పోరాటం చేశారు. విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు.

ధర్నా చౌక్‌తో సంబంధం

కేసీఆర్‌ ప్రభుత్వం ధర్నా చౌక్‌ను నిషేధించిన తర్వాత దానిని తెరిపించడానికి అనేక పోరాటాలలో భాగస్వాములైన రేవంత్‌రెడ్డికి ఇందిరాపార్కు ధర్నాచౌక్‌తో అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ జరిగిన అనేక ఆందోళనల్లో పాల్గొన్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతులు, నిరుద్యోగుల సమస్య, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ జరిగిన పోరాటాల్లో పాల్గొన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ధర్నాలు చేసి నిరసన వ్యక్తం చేయడంలో కీలక పాత్ర పోషించారు. చలో సెక్రటేరియట్‌, చలో అంసెబ్లీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Updated Date - 2023-12-07T11:58:57+05:30 IST