Share News

BJP MLAs: అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు.. స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం

ABN , Publish Date - Dec 14 , 2023 | 11:27 AM

Telangana: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్ ఎన్నికయ్యారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా గడ్డం ప్రసాద్‌ను తోడ్కొని పోయి స్పీకర్‌ కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే ప్రొటెం స్పీకర్‌గా అక్బురుద్దీన్ ఓవైసీ నియామాకాన్ని వ్యతిరేకిస్తూ మొదటి రోజు అసెంబ్లీకి గైర్హాజరైన బీజేపీ ఎమ్మెల్యేలు రెండో రోజు అసెంబ్లీకి వచ్చారు.

BJP MLAs: అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు.. స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్ ఎన్నికయ్యారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా గడ్డం ప్రసాద్‌ను తోడ్కొని పోయి స్పీకర్‌ కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే ప్రొటెం స్పీకర్‌గా అక్బురుద్దీన్ ఓవైసీ నియామాకాన్ని వ్యతిరేకిస్తూ మొదటి రోజు అసెంబ్లీకి గైర్హాజరైన బీజేపీ ఎమ్మెల్యేలు రెండో రోజు అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా స్పీకర్‌ గడ్డ ప్రసాద్ కుమార్ సమక్షంలో ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఉన్న నేపథ్యంలో ప్రమాణస్వీకారానికి బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ బాధ్యతలు చేపట్టడంతో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

కాగా.. అంతకుముందు సభ మొదలైన వెంటనే ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయని ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్వీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. వివిధ పార్టీల సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మేల్యేలుగా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు.

Updated Date - Dec 14 , 2023 | 11:51 AM