Share News

T.Congress: సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు

ABN , First Publish Date - 2023-12-02T14:07:32+05:30 IST

Telangana: తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌‌తో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైతుబంధు నిధులు దారి మళ్లిస్తున్నారని సీఈవోకు నేతలు ఫిర్యాదు చేశారు.

T.Congress: సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్‌: తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌‌తో (Telangana CEO Vikasraj) కాంగ్రెస్ నేతలు (Congress Leaders) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైతుబంధు (Rythy Bhandu) నిధులు దారి మళ్లిస్తున్నారని సీఈవోకు నేతలు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈవోతో భేటీ అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. రైతుబంధు నిధుల దారి మళ్లింపుపై ఢిల్లీలో సీఈసీ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. నాలుగు అంశాలపై సీఈవో వికాస్‌రాజ్‌‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రైతుబంధు నిధులను మళ్లిస్తున్నారని ఫిర్యాదు చేశామన్నారు. భూ రికార్డులు మారుస్తున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. అసైన్డ్‌ ల్యాండ్స్‌ రికార్డులు మారుస్తున్నారన్నారు. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని సీఈసీకి ఫిర్యాదు చేశామని ఉత్తమ్‌కుమార్ వెల్లడించారు. సీఈవోను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి (TPCC Chief Revanth Reddy), మధుయాష్కీ (Madhu Yashki), ఉత్తమ్‌ (Uttam kumar), పొంగులేటి (Ponguleti Srinivas) ఉన్నారు.

Updated Date - 2023-12-02T14:07:35+05:30 IST