Share News

KTR: స్పీకర్ ఎన్నికకు మద్దతివ్వాలని కేసీఆరే ఆదేశించారు..

ABN , Publish Date - Dec 14 , 2023 | 12:02 PM

Telangana: స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు అడగగానే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశించారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం స్పీకర్ ఎన్నికకు ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ... మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాగే సభా హక్కులను కాపాడాలని కోరుతున్నట్లు తెలిపారు.

KTR: స్పీకర్ ఎన్నికకు మద్దతివ్వాలని కేసీఆరే ఆదేశించారు..

హైదరాబాద్: స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridharbabu) అడగగానే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (BRS Chief KCR) ఆదేశించారని మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) అన్నారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికకు ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ... మధుసూదనాచారి (Madhusudanchari), పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) లాగే సభా హక్కులను కాపాడాలని కోరుతున్నట్లు తెలిపారు. సామాన్య ప్రజలు సమస్యలు చర్చకు వచ్చేలా చూడాలన్నారు. తెలంగాణ ఉధ్యమ సమయంలో సిరిసిల్లకు రావాలని తాను గడ్డం ప్రసాద్‌ను ఆహ్వానించానని.. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన రాలేకపోయారని కేటీఆర్ పేర్కొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 12:27 PM