Share News

Gutha Sukhender Reddy : భేదాభిప్రాయాలతో పార్టీని వీడుతున్నారు

ABN , First Publish Date - 2023-10-25T10:13:38+05:30 IST

తాను ఏ పార్టీలో ఉన్నా పార్టీ నిర్ణయాలకే కట్టుబడి ఉన్నానని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన నల్గొండలోని తన నివాసంలో మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యేలతో ఉన్న భేదాభిప్రాయాలతో పార్టీని వీడుతున్నారన్నారు

Gutha Sukhender Reddy : భేదాభిప్రాయాలతో పార్టీని వీడుతున్నారు

నల్గొండ : తాను ఏ పార్టీలో ఉన్నా పార్టీ నిర్ణయాలకే కట్టుబడి ఉన్నానని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన నల్గొండలోని తన నివాసంలో మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యేలతో ఉన్న భేదాభిప్రాయాలతో పార్టీని వీడుతున్నారన్నారు. పార్టీలు మారాల్సిన అవసరం తన లాంటి వాళ్లకు లేదన్నారు. పార్టీ ఆదేశిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాను కానీ... తన కుమారుడు అమిత్ కానీ పోటీలో ఉంటామన్నారు. మూడోసారి కేసీఆర్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-10-25T10:13:38+05:30 IST