Share News

KTR : 3వ తేదీ తర్వాత తిరిగి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది

ABN , First Publish Date - 2023-11-02T13:45:04+05:30 IST

పార్క్‌హయత్‌లో సీఎంఎస్టీఈఐ గిరిజన వ్యవస్థాపకుల సక్సెస్ మీట్‌కు మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 3వ తేదీ తర్వాత తిరిగి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు.

KTR : 3వ తేదీ తర్వాత తిరిగి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది

హైదరాబాద్ : పార్క్‌హయత్‌లో సీఎంఎస్టీఈఐ గిరిజన వ్యవస్థాపకుల సక్సెస్ మీట్‌కు మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 3వ తేదీ తర్వాత తిరిగి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. దేవుడు మనిషిని పుట్టించాడని.. మనిషి కులాన్ని పుట్టించాడన్నారు. ప్రతి మనిషికి సమానమైన తెలివితేటలు ఉంటాయని బలంగా నమ్ముతానని కేటీఆర్ పేర్కొన్నారు. టాలెంట్ అనేది ఏ ఒక్కరి సొత్తూ కాదన్నారు. సరైన సమయంలో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. సీఎంఎస్టీఈ ప్రోగ్రాం ద్వారా విజయం సాధించిన 500 మంది గిరిజన సోదరులు ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా పనిచేయాలన్నారు. గిరిజన సోదరుల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Updated Date - 2023-11-02T13:45:06+05:30 IST