‘నాపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు’

ABN , First Publish Date - 2023-05-16T16:54:50+05:30 IST

పార్టీ మార్పుపై ఎంపీ సోయం బాపూరావు (Soyam Bapu Rao) రియాక్ట్ అయ్యారు.

‘నాపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు’

హైదరాబాద్: పార్టీ మార్పుపై ఎంపీ సోయం బాపూరావు (Soyam Bapu Rao) రియాక్ట్ అయ్యారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తోన్న ప్రచారాన్ని ఖండించారు. తాను కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరుతున్నట్లు తప్పడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై అర్థం లేని ఆరోపణలు బాధాకరమన్నారు. ఈ నెల 27న తన కొడుకు పెళ్లి ఉందని, పెళ్లి కార్డులు అన్ని పార్టీల వారికీ ఇస్తామని తెలిపారు. పార్టీలకు అతీతంగా పెళ్లికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అందులో భాగంగా కేసీఆర్, రేవంత్ రెడ్డికి సైతం పెళ్ళి పత్రిక ఇస్తానన్నారు. మహేశ్వర్ రెడ్డిని బీజేపీ (BJP)లోకి తానే ఆహ్వానించానని, మహేశ్వర్‌రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవన్నారు. తనపై తప్పుడు ప్రచారం వెనక బీఆర్ఎస్ హస్తం ఉందన్నారు.

Updated Date - 2023-05-16T16:54:50+05:30 IST