Share News

Nama Nageshwarrao: కేసీఆర్‌ వెళ్లిన ప్రతీ సభలోనూ బ్రహ్మాండమైన స్పందన

ABN , First Publish Date - 2023-11-06T12:05:48+05:30 IST

సీఎం కేసీఆర్ వెళ్లిన ప్రతి సభలో ప్రజల నుంచి స్పందన బ్రహ్మాండంగా వస్తోందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.

Nama Nageshwarrao: కేసీఆర్‌ వెళ్లిన ప్రతీ సభలోనూ బ్రహ్మాండమైన స్పందన

ఖమ్మం: సీఎం కేసీఆర్ (CM KCR) వెళ్లిన ప్రతి సభలో ప్రజల నుంచి స్పందన బ్రహ్మాండంగా వస్తోందని ఎంపీ నామా నాగేశ్వరరావు (MP Nama Nageshwarrao) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిన్న తమ నాయకుడు సీఎం కేసీఆర్ సభ నిర్వహిస్తే రెండు సభలు విజయవంతం అయ్యాయని తెలిపారు. గత 10 సంవత్సరాల్లో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లాయన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేస్తున్న తమ అభ్యర్థులందరిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇంతకు ముందు ఉన్న రాజకీయాల గురించి సీఎం కేసీఆర్ క్లియర్‌గా చెప్పారన్నారు. ఎన్నికలు వచ్చాయంటే అన్ని పార్టీల వారు వస్తుంటారని.. ఒకవేళ గెలిస్తే తిరిగి ఖమ్మం వైపు కూడా చూడరన్నారు. అస్సలు వారి చరిత్ర ఏంటి ప్రజలు గమనించి, వాళ్ళు 60 యేళ్లు అధికారంలో ఉండి ఖమ్మం జిల్లాకు ఏమీ చేశారని ఆలోచించి ఓటు వేయాలన్నారు. కారు గుర్తుపై ఓటు వేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నామా నాగేశ్వరరావు కోరారు.

Updated Date - 2023-11-06T12:05:49+05:30 IST