Share News

Kodandaram: కేసీఆర్ పాలన చూసి గుండెలు మండుతున్నాయి

ABN , First Publish Date - 2023-11-10T17:18:33+05:30 IST

ఒకే కుటుంబం అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకుంది. కాళేశ్వరం ద్వారా జేబులు నింపుకున్నారు. మీ దృష్టి ఇసుక దందాలు, కాంట్రాక్టుల మీద ఉంది కానీ ప్రజా సంక్షేమం మీద లేదు. సర్కారు నడిపే పద్ధతి ఇది కాదు.. మంది సొమ్ము

Kodandaram: కేసీఆర్ పాలన చూసి గుండెలు మండుతున్నాయి

కామారెడ్డి: సీఎం కేసీఆర్ (Cm kcr) నిరంకుశ పాలన చూసి గుండెలు మండుతున్నాయని ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram) ఆవేదన వ్యక్తం చేశారు. కోదండరాం మాట్లాడుతూ కేసీఆర్‌పై మండిపడ్డారు. ‘‘ఒకే కుటుంబం అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకుంది. కాళేశ్వరం ద్వారా జేబులు నింపుకున్నారు. మీ దృష్టి ఇసుక దందాలు, కాంట్రాక్టుల మీద ఉంది కానీ ప్రజా సంక్షేమం మీద లేదు. సర్కారు నడిపే పద్ధతి ఇది కాదు.. మంది సొమ్ము తినడం మంచిది కాదని చెప్పినందుకే నాతో గొడవ పెట్టుకున్నారు. కేసీఆర్ చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెస్తే.. చనిపోయిన వారి త్యాగాలకు ఎలా విలువ కట్టాలి. తెలంగాణ ప్రజల తరఫున న్యాయం చెప్పే అవకాశం కామారెడ్డి ప్రజలకు దక్కింది. మేడిగడ్డ కూలినట్లు కేసీఆర్ సర్కారును కూల్చాలి.’’ అని ప్రజలకు కోదండరాం పిలుపునిచ్చారు.

Updated Date - 2023-11-10T17:18:38+05:30 IST