Share News

Sivaji: బ్లూ మీడియాపై శివాజీ సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - Jun 25 , 2024 | 12:45 PM

బ్లూ మీడియాపై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా జర్నలిజం ముసుగులో కొందరు తమ చానళ్లలో ఏపీపై విషం చిమ్ముతున్నారని, అలాంటి వారిని నమ్మొద్దని పిలుపునిచ్చారు..

Sivaji: బ్లూ మీడియాపై శివాజీ సంచలన వ్యాఖ్యలు..

హైదరాబాద్: బ్లూ మీడియాపై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా జర్నలిజం ముసుగులో కొందరు తమ చానళ్లలో ఏపీపై విషం చిమ్ముతున్నారని, అలాంటి వారిని నమ్మొద్దని పిలుపునిచ్చారు. కొందరు జర్నలిస్టుల ముసుగులో ఉన్న ఎర్నలిస్టులు.. వాళ్లు అనుకున్న రాజకీయ పార్టీలను అధికారంలోకి తేవడానికి ప్రజల భవిష్యత్‌తో ఆడుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి వారిని బయటికి తరిమేస్తేనే ఆ చానళ్లు బాగుపడతాయంటూ హితవుపలికారు. ఇలాంటి బ్లూమీడియాను ప్రజలను అస్సలు నమ్మొద్దన్నారు. పొట్టోడు అంటూ ఓ వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ... అమరావతిపై ఇన్నాళ్లూ తప్పుడు ప్రచారం చేశారని, మళ్లీ ఇప్పుడు సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేస్తున్నట్లు నటిస్తున్నారని చెప్పారు. ఇలా నటించి చివరకు వాళ్ల అసలు డ్రామా మొదలుపెడతారని, ఇలాంటి వారిని ఏపీ ప్రజలు దూరం పెట్టాలని శివాజీ పేర్కొన్నారు.

Updated Date - Jun 25 , 2024 | 05:29 PM