Share News

GANESH : పార్వతి తనయా నమోనమః

ABN , Publish Date - Sep 09 , 2024 | 12:29 AM

పల్లెలు, పట్టణాలు తేడాలేకుండా వీధివీధినా బొజ్జగణపయ్య కొలువై భక్తకోటికి కనువిందు చేశాడు. వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం అనంతపురం నగరంలోను, నియోజకవరగంలోను ప్రజలు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వాడవాడల్లో గణనాథు డు కొలువుు దీరాడు. అయా మండపాల వద్ద ఘనంగా పూజలు నిర్వహించారు.

GANESH : పార్వతి తనయా నమోనమః
Anantapuram City RF Road Venkateswara Temple in front of Koluvudu Vinayaka

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌)

పల్లెలు, పట్టణాలు తేడాలేకుండా వీధివీధినా బొజ్జగణపయ్య కొలువై భక్తకోటికి కనువిందు చేశాడు. వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం అనంతపురం నగరంలోను, నియోజకవరగంలోను ప్రజలు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వాడవాడల్లో గణనాథు డు కొలువుు దీరాడు. అయా మండపాల వద్ద ఘనంగా పూజలు నిర్వహించారు. రెండో రోజు ఆదివారం కూడా గణనాథుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా మండపాల వద్ద భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం చేపట్టారు. గ్రామాల్లో కొలువైన వినాయక విగ్రహాలను మూడో రోజైన సోమవారం సమీప చెరువుల్లో నిమజ్జన చేయనున్నట్లు ఆయా ఉత్సవకమిటీల సభ్యులు తెలిపారు.

Updated Date - Sep 09 , 2024 | 12:29 AM