Share News

‘ఉపాధ్యాయులను గౌరవించాలి’

ABN , Publish Date - Sep 30 , 2024 | 12:21 AM

ఏలేశ్వరం, సెప్టెంబరు 29: ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు. ఆదివారం ఎంపీడీవో కార్యాలయం నం దు మండల యూటీఎఫ్‌ శాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్స వం రోజున ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన అవార్డు గ్రహీతలకు సన్మానం నిర్వహించారు.

‘ఉపాధ్యాయులను గౌరవించాలి’
ఉత్తమ ఉపాధ్యాయురాలిని సత్కరిస్తున్న ఎమ్మెల్యే

ఏలేశ్వరం, సెప్టెంబరు 29: ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు. ఆదివారం ఎంపీడీవో కార్యాలయం నం దు మండల యూటీఎఫ్‌ శాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్స వం రోజున ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన అవార్డు గ్రహీతలకు సన్మానం నిర్వహించారు. జిల్లా ఉత్తమ అవార్డు పొందిన దేశెట్టి కుమారి, రామలక్ష్మీ, జి.మురళీకృష్ట, మండల స్థాయి ఉత్తమ అవార్డు గ్రహీతలు ఎమ్‌.భాధ్య, సిహెచ్‌.స్వరాజ్యకుమారి, కె.లింగేశ్వర, కె.దేనదేవి, టి.శ్రీనివాసరావు, కె.వీర్రా జుకు ఎమ్మెల్యే శాలువా కప్పి, పూలమాలలు వేసి సత్కరించారు. ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంఈవోలు బి.అబ్బాయి, వరలక్ష్మీ, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, వైస్‌ ఎంపీపీ చిక్కాల రాజ్యలక్ష్మీ దేవి, జ్యోతుల పెదబాబు, బొదిరెడ్డి గోపి,నూకరాజు ఉన్నారు.

Updated Date - Sep 30 , 2024 | 12:21 AM