Share News

AP Election Results: పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీ అధిక్యం..

ABN , Publish Date - Jun 04 , 2024 | 08:35 AM

ఏపీలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ అభ్యర్థులు పైచేయి సాధించినట్లు తెలుస్తోంది. రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, నెల్లూరు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు అధిక్యంలో ఉన్నారు.

AP Election Results: పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీ అధిక్యం..
Votes Counting

ఏపీలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ అభ్యర్థులు పైచేయి సాధించినట్లు తెలుస్తోంది. రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, మండపేట, నెల్లూరు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు అధిక్యంలో ఉన్నారు. దీంతో ఉద్యోగులు టీడీపీకి ఓటు వేశారనే విషయం స్పష్టమవుతోంది. వైసీపీపై ఉద్యోగులు పూర్తి వ్యతిరేకతతో ఉండటంతో.. సామాన్య ఓటరు సైతం ఇదే తీర్పు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో గంటలో ఫలితాల సరళి తెలియనుంది.


AP Election Result 2024 Live Updates: టెన్షన్ టెన్షన్.. ఏపీ అసెంబ్లీ కౌంటింగ్ లైవ్ అప్‌డేట్స్.

Lok Sabha Election Results 2024 Live Updates: దేశ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 04 , 2024 | 10:52 AM