Share News

Crime News: రాజమహేంద్రవరంలో ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఇద్దరు ఆత్మహత్య..

ABN , Publish Date - Jun 15 , 2024 | 12:14 PM

రాజమహేంద్రవరం(Rajamahendravaram) శంభునగర్‌లో రైల్వే ఫ్లైఓవర్(Railway Flyover) పైనుంచి దూకి ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఫ్లై ఓవర్ పైనుంచి దూకడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

Crime News: రాజమహేంద్రవరంలో ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఇద్దరు ఆత్మహత్య..

తూర్పుగోదావరి: రాజమహేంద్రవరం(Rajamahendravaram) శంభునగర్‌లో రైల్వే ఫ్లైఓవర్(Railway Flyover) పైనుంచి దూకి ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఫ్లై ఓవర్ పైనుంచి దూకడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కుటుంబకలహాలతో ఆత్మహత్య చేసుకున్నారా, లేక మరేదైనా కారణం ఉందా? అని పలు కోణాల్లో విచారణ చేపట్టారు. ఒకేసారి ఇద్దరు మృతిచెందడంతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. ఘటన గురించి తెలియడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan: ఐఏఎస్ కృష్ణతేజకు అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్

Minister Ravindra: నాసిరకం మద్యంతో ప్రాణాలు తీసిన ఏ ఒక్కరినీ వదలను: మంత్రి కొల్లు రవీంద్ర

Updated Date - Jun 15 , 2024 | 12:14 PM