Share News

AP Elections 2024: ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి.. జగన్ ప్రమాణ స్వీకారం చేసేది అప్పుడే: మంత్రి బొత్స

ABN , Publish Date - May 17 , 2024 | 05:45 PM

ఈ ఎన్నికల్లో వైసీపీ (YSRCP) తప్పకుండా అధికారంలోకి వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల 9న జగన్ సీఎంగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. వేదిక ఎక్కడో రెండు రోజుల్లో చెబుతానని అన్నారు. కేంద్రంలో తమ మీద ఆధారపడే ప్రభుత్వం రావాలని కోరుకుంటానని... ఇది తన స్వార్థమని తెలిపారు.

AP Elections 2024: ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి.. జగన్  ప్రమాణ స్వీకారం చేసేది అప్పుడే: మంత్రి బొత్స
Botsa Satyanarayana

విశాఖపట్నం: ఈ ఎన్నికల్లో వైసీపీ (YSRCP) తప్పకుండా అధికారంలోకి వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల 9న జగన్ సీఎంగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. వేదిక ఎక్కడో రెండు రోజుల్లో చెబుతానని అన్నారు. కేంద్రంలో తమ మీద ఆధారపడే ప్రభుత్వం రావాలని కోరుకుంటానని... ఇది తన స్వార్థమని తెలిపారు.


AP Elections 2024: ఏపీలో పలువురు అధికారుల బదిలీలు.. కారణమిదే..?

పోలింగ్ సరళి చూస్తే వైసీపీకి 175 స్థానాలు పక్కా..ఉత్తరాంధ్రలో 34 కి 34 స్థానాలు తమవేనని చెప్పారు. రుషి కొండలో నిర్మించిన భవనాలు ఎలా ఉపయోగించుకోవాలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.విశాఖలో జరిగిన ఘటన దురదృష్టమని అన్నారు. ఈ ఘటన లో రాజకీయ కోణం ఉంటే ముమ్మాటికీ తప్పేనని చెప్పారు.


ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేయాలి..దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల పోలీస్ పరిశీలకుడి నియామకంపై అనుమానం ఉందన్నారు. ఎంతో మంది అధికారులు ఉంటే రిటైర్డ్ అయిన అధికారిని పరిశీలకుడుగా నియమించడం అనుమానంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి....

Nakka Anadbabu: అధికార మార్పు తథ్యం... అక్రమార్కులకు శిక్ష ఖాయం

BJP MLAs: వడ్లు కొనుగోలులో సీఎం రేవంత్ సర్కార్ విఫలం..

Vijayashanti: కాంగ్రెస్‌లో ఉంటూనే బీఆర్‌ఎస్‌పై రాములమ్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్...

Updated Date - May 17 , 2024 | 05:53 PM