Share News

AP Elections 2024: గాజువాక ప్రజల అభిప్రాయాల మేరకు మేనిఫెస్టో: మంత్రి గుడివాడ

ABN , Publish Date - May 02 , 2024 | 12:55 PM

Andhrapradesh: గాజువాక పీపుల్స్ మేనిఫెస్టో 2024 మంత్రి గుడివాడ అమర్నాథ్ విడుదల చేశారు. గురువారం గాజువాక పార్టీ ఆఫీసులో నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. గాజువాక నియోజకవర్గం ప్రజల అభిప్రాయాలు సేకరించి మ్యానిఫెస్టో తయారు చేశామని తెలిపారు. ఉగాది రోజున ఒక వెబ్ సైట్‌ను ప్రారంభించి...

AP Elections 2024: గాజువాక ప్రజల అభిప్రాయాల మేరకు మేనిఫెస్టో: మంత్రి గుడివాడ
Minister Gudivada Amarnath

విశాఖపట్నం, మే 2: గాజువాక పీపుల్స్ మేనిఫెస్టో 2024 మంత్రి గుడివాడ అమర్నాథ్ (Minister Gudivada Amarnath) విడుదల చేశారు. గురువారం గాజువాక పార్టీ ఆఫీసులో నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను (Manifesto) మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. గాజువాక నియోజకవర్గం ప్రజల అభిప్రాయాలు సేకరించి మ్యానిఫెస్టో తయారు చేశామని తెలిపారు. ఉగాది రోజున ఒక వెబ్ సైట్‌ను ప్రారంభించి... అభిప్రాయాలు కూడా సేకరించామని మంత్రి చెప్పారు.

AP News: బుర్రలేని సర్కార్‌.. డేటా చోర్‌!


అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయాలను వివిధ పద్ధతుల్లో సేకరించి మ్యానిఫెస్టో రూపకల్పన చేశామన్నారు. గాజువాకను ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల చేశామన్నారు. విశాఖను ధీటుగా గాజువాకను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవారిధి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపకల్పన చేశామని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

AP News: పెన్షన్ కోసం వచ్చి కన్నీరు పెట్టుకుంటున్న వృద్ధులు.. కారణమిదే?

AP Elections: అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం: కేశినేని చిన్ని

Read latest AP News And Telugu News

Updated Date - May 02 , 2024 | 01:30 PM