Share News

AP Elections: 7 గంటలకే ఓటు హక్కు వినియోగించుకోనున్న చంద్రబాబు

ABN , Publish Date - May 13 , 2024 | 06:38 AM

Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా మరికాసేపట్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద మాక్ పోలింగ్ ప్రారంభమైంది. ఏజెంట్ల సమక్షంలో అధికారులు మాక్‌ పోలింగ్ నిర్వహించారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు.

AP Elections: 7 గంటలకే ఓటు హక్కు వినియోగించుకోనున్న చంద్రబాబు
TDP Chief Chandrababu Naidu

అమరావతి, మే 13: రాష్ట్ర వ్యాప్తంగా మరికాసేపట్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ (AP Elections 2024) ప్రారంభంకానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద మాక్ పోలింగ్ ప్రారంభమైంది. ఏజెంట్ల సమక్షంలో అధికారులు మాక్‌ పోలింగ్ నిర్వహించారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఇక టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) ఉదయమే తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

AP Elections 2024: రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన మాక్ పోలింగ్


ఉదయం 7.00 గంటలకు టీడీపీ అధినేత ఓటు వేయనున్నారు. ఉండవల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో టీడీపీ చీఫ్ ఓటు వేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు నాయుడు ఓటు హక్కును వినయోగించుకోనున్నారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.


ఇవి కూడా చదవండి..

Gold and Silver Rates: తగ్గిన బంగారం, వెండి రేట్లు..ఎంతకు చేరాయంటే

కూటమిలో జోష్‌!

Read Latest AP News And Telugu News

Updated Date - May 13 , 2024 | 06:43 AM