Share News

Loksabha Elections: ఖమ్మంలో మాక్‌ పోలింగ్ ప్రారంభం

ABN , Publish Date - May 13 , 2024 | 06:24 AM

Telangana: ఖమ్మం పార్లమెంట్ పరిధిలో మాక్ పోలింగ్ ప్రారంభమైంది. ఏజెంట్ల సమక్షంలో అధికారులు మాక్ పోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభంకానుంది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాల పహారా నడుమ పోలింగ్ కొనసాగనుంది.

Loksabha Elections: ఖమ్మంలో మాక్‌ పోలింగ్ ప్రారంభం
Mock polling begins in Khammam

ఖమ్మం, మే 13: ఖమ్మం (Khammam) పార్లమెంట్ పరిధిలో మాక్ పోలింగ్ (Mock polling) ప్రారంభమైంది. ఏజెంట్ల సమక్షంలో అధికారులు మాక్ పోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభంకానుంది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాల పహారా నడుమ పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

సీఎం ప్రతిష్ఠకు సవాల్‌!


వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా యువ పోలింగ్ కేంద్రాలు, ఆదర్శప్రాయం కేంద్రాలు, మహిళా పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


ఇవి కూడా చదవండి...

ఓటరు స్లిప్పు అందలేదా?

ఎన్నాళ్లకు.. ఎన్నేళ్లకు..!

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 13 , 2024 | 06:26 AM