Share News

Attack on Janasena activist: జనసేన కార్యకర్తపై కత్తితో దాడి చేసిన ప్రత్యర్థులు..

ABN , Publish Date - Jul 14 , 2024 | 09:54 PM

తెనాలి మండలం తేలప్రోలులో జనసేన కార్యకర్తపై ప్రత్యర్థులు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తేలప్రోలు గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త షేక్ ఫయాజ్ బాషా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో గ్రామంలోని వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి.

Attack on Janasena activist: జనసేన కార్యకర్తపై కత్తితో దాడి చేసిన ప్రత్యర్థులు..

గుంటూరు: తెనాలి మండలం తేలప్రోలులో జనసేన కార్యకర్తపై ప్రత్యర్థులు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తేలప్రోలు గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త షేక్ ఫయాజ్ బాషా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో గ్రామంలోని వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ఇది మనసులో పెట్టుకున్న ప్రత్యర్థులు తాజాగా షేక్ ఫయాజ్ బాషాపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశారు. తీవ్రగాయాలైన బాధితుణ్ని తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజకీయ కక్షలే దాడికి కారణమంటూ బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Jul 14 , 2024 | 09:54 PM