Share News

Jagan : పులివెందులలో జగన్‌ ప్రజాదర్బార్‌

ABN , Publish Date - Jul 08 , 2024 | 03:27 AM

మూడురోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లా పులివెందులకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండోరోజు ఆదివారం పులివెందుల పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు.

Jagan : పులివెందులలో జగన్‌ ప్రజాదర్బార్‌

  • రెండో రోజూ కొనసాగిన పర్యటన

పులివెందుల, జూలై 7: మూడురోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లా పులివెందులకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండోరోజు ఆదివారం పులివెందుల పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌ను కలిసేందుకు నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. పలువురు వారి సమస్యలను విన్నవించారు. కొందరు అనారోగ్య సమస్యలపై వివరించి ఆర్థికసాయాన్ని అభ్యర్థించారు. అలాగే యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని అడిగారు. లింగాల మండలంలోని పెద్దకుడాల గ్రామంలోని మాజీ ఎంపీపీ సుబ్బారెడ్డి సతీమణి లక్ష్మినరసమ్మ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పులివెందుల పట్టణంలో ఓ చిన్నారి పాముకాటుకు గురై మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. మళ్లీ పార్టీ కార్యాలయానికి చేరుకుని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 03:27 AM