Share News

Somireddy: విజయసాయి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే

ABN , Publish Date - Jul 18 , 2024 | 09:35 AM

Andhrapradesh: వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కుల ప్రాధాన్యాల గురించి విజయసాయి వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కుల ప్రాధాన్యాల గురించి విజయసాయి రెడ్డి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే అంటూ ఎద్దేవా చేశారు. 2022-24 మధ్యకాలంలో ఒక కులంపై కక్షకట్టి కేబినెట్‌లో ప్రాతినిధ్యమే లేకుండా చేశారని గుర్తుచేశారు.

 Somireddy: విజయసాయి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే
Former Minister Somireddy Chandramohan Reddy

అమరావతి, జూలై 18: వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై (YSRCP Leader Vijayasaireddy ) మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Former Minister Somireddy Chandramohan Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కుల ప్రాధాన్యాల గురించి విజయసాయి వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కుల ప్రాధాన్యాల గురించి విజయసాయి రెడ్డి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టేఅంటూ ఎద్దేవా చేశారు. 2022-24 మధ్యకాలంలో ఒక కులంపై కక్షకట్టి కేబినెట్‌లో ప్రాతినిధ్యమే లేకుండా చేశారని గుర్తుచేశారు. వైసీపీ హయాంలో సీఎం నుంచి సెక్రటరీ వరకు కీలక పదవులన్నీ ఒక కులానికే కట్టబెట్టుకున్నారని మండిపడ్డారు.

Tomato prices: ఠారెత్తిస్తున్న టమాటా!


రాష్ట్ర సంపదనంతా ఆ కులానికే దోచిపెట్టారన్నారు. అందుకే మన కులస్తులు కూడా తిరగబడి తెలుగుదేశం పార్టీకి (Telugu desam Party) ఓటు వేశారని తెలిపారు. పాపాలు చేసిన వైసీపీని (YSRCP) ఇంట్లో కూర్చోపెట్టారన్నారు. రాష్ట్రంలో నేరాలు - ఘోరాలకు మొన్నటి ఎన్నికల్లో ఏ కులం కూడా వైసీపీకి మిగలలేదననారు. రేపోమాపో తమరిని జైలుకూ పంపబోతున్నారన్నారు. అడ్డమైన కూతలతోనే వైసీపీ స్కోరు 11కి పడిపోయిందని విమర్శించారు. ఇప్పటికైనా విడిచిపెట్టిన భాషతో వీధికెక్కడం మాని వయస్సుకు తగ్గట్టు నడుచుకో అంటూ విజయసాయిరెడ్డికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవుపలికారు.


ఇవి కూడా చదవండి...

AP News: వినుకొండలో నడిరోడ్డుపై హత్య ఉదంతంపై స్పందించిన టీడీపీ

కుమ్మేయ్‌... అమ్మేయ్‌!

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 18 , 2024 | 09:37 AM