Share News

CEO MK Meena: కృష్ణావర్శిటీలో సీఈవో ఎంకే మీనా కౌంటింగ్ కేంద్రం తనిఖీ..

ABN , Publish Date - May 30 , 2024 | 01:44 PM

మచిలీపట్నంలోని కృష్ణావర్శిటీ(Krishna University)లో ఏర్పాటు చేసిన ఓట్ల కౌంటింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా(CEO MK Meena) సందర్శించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారులు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.

CEO MK Meena: కృష్ణావర్శిటీలో సీఈవో ఎంకే మీనా కౌంటింగ్ కేంద్రం తనిఖీ..
CEO MK Meena

కృష్ణాజిల్లా: మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీ(Krishna University)లో ఏర్పాటు చేసిన ఓట్ల కౌంటింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా(CEO MK Meena) సందర్శించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారులు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన టేబుల్స్, రౌండ్ల వివరాలను సీఈవోకి కలెక్టర్ డీకే బాలాజీ వివరించారు. భద్రతాపరంగా తీసుకున్న చర్యలను మీనాకు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి వివరించారు. త్వరితగతిన ఫలితాలను వెల్లడించేందుకు కృషి చేస్తామని తెలిపారు.


రాష్ట్రంలో ఎన్నికల రోజు, తర్వాత జరిగిన ఘర్షణలు, పరిణామాల నేపథ్యంలో పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సీఈవో మీనా.. కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు. కౌంటింగ్ రోజున ఎటువంటి అల్లర్లు జరగకుండా తగినంత బలగాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఏదైనా అనుకోని సంఘటనలు తలెత్తితే ఉన్నతాధికారులకు వెంటనే సమాచారం అందించాలని ఆదేశించారు. కౌంటింగ్ వేళ ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా చూడాలన్నారు.

ఇది కూడా చదవండి:

AP politics: పేట్రేగిపోతున్న వైసీపీ మూకలు.. బెంబేలెత్తుతున్న ఎన్నికల అధికారులు..!

Chandrababu: చంద్రబాబు ఎఫెక్ట్.. యూపీఎస్సీ నిర్ణయంతో కంగుతిన్న వైసీపీ!

For more Andhrapradesh news and Telugu news..

Updated Date - May 30 , 2024 | 01:54 PM