Share News

TDP: ఉద్యోగుల ఓట్ల కోసం జగన్ రెడ్డి కుయుక్తులు: అశోక్ బాబు

ABN , Publish Date - May 02 , 2024 | 01:57 PM

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్‌బాబు కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా గురువారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఉద్యోగులకు గౌరవంలేదని, అన్నీ ఇబ్బందులేనని, కూపన్‌లు, గిఫ్ట్‌లు ఇచ్చి ఉద్యోగులను మరోసారి ప్రలోభ పెడుతున్నారని విమర్శించారు.

TDP: ఉద్యోగుల ఓట్ల కోసం జగన్ రెడ్డి కుయుక్తులు: అశోక్ బాబు
TDP Ashokbabu

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం (YCP)పై తెలుగుదేశం ఎమ్మెల్సీ (TDP MLC) అశోక్‌బాబు (Ashokbabu) కామెంట్స్ (Comments) చేశారు. ఈ సందర్బంగా గురువారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలన (YCP Govt.)లో ఉద్యోగులకు (Employees) గౌరవంలేదని, అన్నీ ఇబ్బందులేనని, కూపన్‌లు, గిఫ్ట్‌లు ఇచ్చి ఉద్యోగులను మరోసారి ప్రలోభ పెడుతున్నారని విమర్శించారు. ఉద్యోగుల ఓట్ల కోసం జగన్ రెడ్డి (CM Jagan) కుయుక్తులు మొదలెట్టారని అన్నారు. రివర్స్ పీఆర్సీతో జగన్ రెడ్డి ఉద్యోగులను నిండా ముంచారని, జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని.. ఇవాళ జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఉన్నారని అశోక్ బాబు అన్నారు.


తెలుగుదేశం పాలనలోనే ఉద్యోగస్తులకు మేలు జరిగిందని, వారికి గౌరవం దక్కిందని అశోక్ బాబు అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఐదు లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయని, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఉద్యోగులు సద్వినియోగం చేసుకుని జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని పిలుపిచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే ఉద్యోగులకు అన్ని రకాలుగా మేలు జరుగుతుందన్నారు. వైసీపీ పాలనలో ఉద్యోగస్తుల్లో ఏ వర్గానికి మేలు జరగలేదని, ఉద్యోగులను మోసగించిన జగన్‌ను ఇంటికి పంపాలని అశోక్ బాబు మరోసారి పిలుపిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ ఎవరికి, ఎంతమందికి దత్తపుత్రుడో చెప్పాలి: కనకమేడల

జగన్ మేనిఫెస్టో డొల్ల: జయ నాగేశ్వర్ రెడ్డి

వైసీపీని పాతాళంలో కలపాలి: సత్యప్రసాద్

కూటమిదే విజయం: గంటా శ్రీనివాసరావు

అది.. జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 02 , 2024 | 02:04 PM