Share News

Kotamreddy: జైలుకు రాబోతున్నారు కాబట్టే ముందుగా చూసుకునేందుకు వచ్చారు.. జగన్‌పై టీడీపీ నేత ఎద్దేవ

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:55 PM

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్ది తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. లెవన్ రెడ్ది రాష్ట్రాన్ని దోచుకొని ఆర్ధికంగా కుదేలు చేశారని మండిపడ్డారు. ఒక క్రిమినల్, రౌడీలని పరామర్శించేందుకు రూ.25 లక్షలు ఖర్చుపెట్టుకొని వచ్చారన్నారు.

Kotamreddy: జైలుకు రాబోతున్నారు కాబట్టే ముందుగా చూసుకునేందుకు వచ్చారు.. జగన్‌పై టీడీపీ నేత ఎద్దేవ

నెల్లూరు, జూలై 5: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jaganmohan Reddy) టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్ది (TDP Leader Kotamreddy Srinivasulu reddy) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. లెవన్ రెడ్ది రాష్ట్రాన్ని దోచుకొని ఆర్ధికంగా కుదేలు చేశారని మండిపడ్డారు. ఒక క్రిమినల్, రౌడీలని పరామర్శించేందుకు రూ.25 లక్షలు ఖర్చుపెట్టుకొని వచ్చారన్నారు. లెవన్ రెడ్ది త్వరలో జైలుకి వచ్చేందుకు, ముందుగా చూసుకునేందుకు వచ్చారంటూ ఎద్దేవా చేశారు.

BRS: కారు పార్టీని కంగారెత్తిస్తున్న ‘ఆరు’.. మరో ఆరుగురు జంప్!


చెయ్యాల్సిన ఆరాచకాలన్నీ చేసి, ఇప్పుడు వేదాలు వల్లిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తమను జగన్ రెడ్డిలా దుర్మార్గాలు చేయవద్దని ఆదేశించారని తెలిపారు. జగన్ రెడ్డి ఆర్ధిక ఉగ్రవాది కాబట్టి... క్రిమినల్ రామకృష్ణ రెడ్డికి మంచోడని సిర్టిఫికెట్ ఇస్తున్నారన్నారు. జగన్ ఎన్ని జన్మలెత్తినా మళ్లీ అధికారంలోకి రాలేరని స్పష్టం చేశారు. ఈవీఎం పగులకొట్టినట్టు జగన్ ఒప్పుకున్నాడు కాబట్టి, ఎన్నికల సంఘం సుమోటోగా జగన్‌పై కేసు నమోదు చేయాలని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

Hyderabad: బిల్డింగ్‌ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్.. కారణమిదేనట..!

Harish Rao: ఇది ముమ్మాటికీ ప్రజాపాలన కాదు.. అప్రజాస్వామ్యపాలన

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 05 , 2024 | 01:12 PM