Share News

AP News: విశాఖ స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టులపై హైకోర్టు విచారణ

ABN , Publish Date - May 08 , 2024 | 04:32 PM

విశాఖ స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టులో కార్మికుల మధ్య ఏర్పడిన వివాదంపై ఏపీ హైకోర్టు (AP High Court) ఈరోజు(బు‍ధవారం) విచారణ చేపట్టింది. ఈ వివాదంపై యూనియన్ కోర్టు హైకోర్టులో ధిక్కార పిటీషన్ దాఖలు చేసింది. గంగవరం పోర్టులో కార్మికుల ఆందోళనతో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా ఆగిపోయిందని వెంటనే జోక్యం చేసుకోవాలని గతంలో హైకోర్టులో పోర్టు యూనియన్ నేత కేవీడి ప్రసాద్ పిటీషన్ దాఖలు చేశారు.

AP News: విశాఖ స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టులపై హైకోర్టు విచారణ

అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టులో కార్మికుల మధ్య ఏర్పడిన వివాదంపై ఏపీ హైకోర్టు (AP High Court) ఈరోజు(బు‍ధవారం) విచారణ చేపట్టింది. ఈ వివాదంపై యూనియన్ కోర్టు హైకోర్టులో ధిక్కార పిటీషన్ దాఖలు చేసింది. గంగవరం పోర్టులో కార్మికుల ఆందోళనతో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా ఆగిపోయిందని వెంటనే జోక్యం చేసుకోవాలని గతంలో హైకోర్టులో పోర్టు యూనియన్ నేత కేవీడి ప్రసాద్ పిటీషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం సమస్యను వెంటనే పరిష్కరించాలని, ఈ లోపు బొగ్గు సరఫరా చేసే కన్వేయర్ బెల్ట్‌ను ప్రారంభించాలని హైకోర్టు ఆదేశించింది.


ఈ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్, కమిషనర్, పోర్టు అధికారులకు గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సమస్య పరిష్కారం కాకపోతే రేపటి నుంచి స్టీల్ ప్లాంట్ మూతపడే పరిస్థితి ఉందని యూనియన్ కోర్టు ధిక్కార పిటిషన్ వేసింది. ఈ రోజు లంచ్ మోషన్ వేయడంతో హైకోర్టు మధ్యాహ్నం విచారణ చేపట్టింది. తమకు కోర్ట్ ధిక్కార పిటిషన్‌పై స్పందించేందుకు ఒక రోజు సమయం కావాలని గంగవరం పోర్టు తరపు న్యాయవాది కోరారు. అయితే విచారణను రేపటికి హైకోర్టు వాయిదా వేసింది.

AP News: ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 08 , 2024 | 04:52 PM