Share News

మూడంతస్తుల భవనం కూలి..ఒకే కుటుంబంలో 10 మంది మృతి

ABN , Publish Date - Sep 16 , 2024 | 03:13 AM

భారీ వర్షాల కారణంగా యూపీలోని మేరట్‌లో శనివారం మూడంతస్తుల భవనం కూలి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు. ఐదుగురు గాయపడ్డారు.

మూడంతస్తుల భవనం కూలి..ఒకే కుటుంబంలో 10 మంది మృతి

లఖ్‌నవూ, సెప్టెంబరు 15: భారీ వర్షాల కారణంగా యూపీలోని మేరట్‌లో శనివారం మూడంతస్తుల భవనం కూలి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు. ఐదుగురు గాయపడ్డారు. మరణించిన వారిలో ఐదుగురు మైనర్లు ఉన్నారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కాగా, యూపీలో కురుస్తున్న భారీ వర్షాలకు 11 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భీకర వానలకు ఇప్పటి వరకు 17 మంది మరణించినట్లు సమాచారం.

Updated Date - Sep 16 , 2024 | 03:13 AM