Share News

కేజ్రీవాల్‌ కలలోకొచ్చారు.. హితబోధ చేశారు

ABN , Publish Date - Aug 31 , 2024 | 05:02 AM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. ఆ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే ఒకరికి కలలోకి వచ్చారట! ఆప్‌ను వీడి బీజేపీలో చేరిన తనకు హితబోధ చేశారట! దీంతో తిరిగి సొంతగూటికి చేరుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారట!

 కేజ్రీవాల్‌ కలలోకొచ్చారు.. హితబోధ చేశారు

  • 4 రోజులకే సొంతగూటికి చేరిన ఆప్‌ నేత రాంచందర్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. ఆ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే ఒకరికి కలలోకి వచ్చారట! ఆప్‌ను వీడి బీజేపీలో చేరిన తనకు హితబోధ చేశారట! దీంతో తిరిగి సొంతగూటికి చేరుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారట! గతంలో ఆప్‌ ఎమ్మెల్యేగా పనిచేసి, ప్రస్తుతం ఢిల్లీ మునిపాలిటీలో కౌన్సిలర్‌గా ఉన్న రాంచందర్‌ నాలుగు రోజుల క్రితం ఆప్‌ను వీడి బీజేపీలో చేరారు. అయితే బుధవారం రాత్రి కేజ్రీవాల్‌ తన కలలోకి వచ్చారని, ‘‘రాంచందర్‌.. మేలుకో! మనీశ్‌ సిసోడియాను, పార్టీ ఇతర నేతలను కలిసి మాట్లాడు. నీ కార్యకర్తలతో కలిసి.. నీ ప్రాంతంలో పనిచేసుకో!’’ అంటూ హితబోధ చేశారని రాంచందర్‌ చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన ఆప్‌ నేతలను కలిసి ఈ విషయం చెప్పి.. తిరిగి పార్టీలో చేరారు.

Updated Date - Aug 31 , 2024 | 05:03 AM