Home » AAP
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో న్యూఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త కార్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. స్థానిక లుటియన్స్ ప్రాంతం.. పండిట్ రవి శంకర్ శుక్లా లేన్లో బంగ్లా నెం1ను ఆప్కి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టే 2024-25 బడ్జెట్లో ఢిల్లీకి రూ.350 కోట్లకు మించి కేటాయించరని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ జోస్యం చెప్పారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు మంగళవారంనాడు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానంతరం సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీవ్ర ఆందోళనలో ఉంది. ఆ క్రమంలో బీజేపీతోపాటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సెనాపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మరోసారి నిప్పులు చెరిగారు. ఆదివారం న్యూఢిల్లీలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ హరియాణాలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేజ్రీవాల్ ఐదు గ్యారెంటీలను శనివారం ప్రకటించారు. బాలబాలికలకుఉచిత విద్య, అందరికీ ఉచిత వైద్యం, 24 గంటలు ఉచిత విద్యుత్తు...
'ఉచిత' హామీలతో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆమ్ ఆద్మీ పార్టీ శనివారంనాడు శ్రీకారం చుట్టింది. ఉచిత విద్యుత్- 24 గంటల నిరంతర విద్యుత్, ఉచిత వైద్య చికిత్స, ఉచిత విద్య, మహిళలకు రూ.1000 చొప్పన ప్రతినెలా ప్రోత్సాహకాలు, యువకులందరికీ ఉద్యోగం వంటి 5 హామీలను ప్రకటించింది.
మద్యం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ, ఈడీ కోర్టు జూలై 22 వరకు పొడిగించింది.
మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆరోపణలను తీహాడ్ జైలు ఉన్నతాధికారులు ఖండించారు.
మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఏదైనా జరిగితే బీజేపీదే బాధ్యత అని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి అతిషి స్పష్టం చేశారు. ఆదివారం న్యూఢిల్లీలో ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా పలు రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికలలో ఇండియా కూటమి సత్తా చాటింది. 7 రాష్ట్రాలలోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో పది సీట్లను కూటమి గెలుచుకుంది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్నారు.