Home » AAP
ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ అరెస్ట్ వ్యవహారం పెను దుమారం రేపుతోంది. అరెస్ట్ను నిరసిస్తూ ఈ రోజు ఆప్ బీజేపీ కేంద్ర కార్యాలయానికి ముట్టడికి పిలుపునిచ్చింది. సీఎం కేజ్రీవాల్, ఆప్ ముఖ్యనేతలు బీజేపీ కార్యాలయానికి తరలి వచ్చారు. ఆప్ నేతల బీజేపీ ఆఫీసు ముట్టడి నేపథ్యంలో పోలీసు బలగాలను భారీగా మొహరించారు.
భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని, దేశాన్ని నియంతృత్వం దిశగా నడిపిస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. 'ఆప్'ను లేకుండా చేయాలని బీజేపీ కంకణం కట్టుకున్నందునే తమ నేతలనందరినీ జైలుకు పంపాలనుకుంటోందని అన్నారు.
ఆప్ ఎంపీ స్వాతి మలివాల్పై దాడికి సంబంధించి అల్ ఇండియా మెడికల్ సైన్సెన్స్ (ఎయిమ్స్) శనివారం నివేదిక ఇచ్చింది. ఆమె ఎడమ కాలుతోపాటు కుడి చెంపకు గాయాలున్నాయని ఆ నివేదకలో ఎయిమ్స్ స్పష్టం చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బెయిల్ మీద బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికెళ్లానని స్వాతి మాలివాల్ వివరించారు. ఆ సమయంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే ఏ ఒక్క నేతను వదిలిపెట్టదని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఓకే దేశం, ఓకే నేత విధానంపై ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బీజేపీకి ప్రజల ఆదరణ తగ్గిందని ఆయన వివరించారు.
సొంత పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ తనపై దాడి జరిగిందంటూ చేసిన ఆరోపణలను 'ఆప్' కీలక నేతలు అంతే ధీటుగా తిప్పికొడుతున్నారు. తాజాగా 'ఆప్' మంత్రి అతిషి అగర్వాల్ కూడా ఇందులో చేరారు. బీజేపీ కుట్రలో స్వాతి మలివాల్ ఒక పావుగా మారారని, ముఖ్యమంత్రి నివాసంలో ఆయన సహాయకుడు తనపై దాడి చేసినట్టు ఆమె చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని చెప్పారు.
ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి వ్యవహారం ముదురుతోంది. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేసినట్టు స్వాతి మలివాల్ చేసిన ఆరోపణలపై తొలుత ఆమెకు మద్దతుగా నిలుస్తామని ప్రకటించిన 'ఆప్' తాజాగా ఆమెపై గుర్రుమంటోంది. ఈ వివాదాన్ని స్వాతి మలివాల్ పొడిగిస్తూ పోతుండటంతో ఆమెకు, ఆప్కు మధ్య 'మాటల యుద్ధం' ముదురుతోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతీమాలీవాల్(Swati Maliwal)పై దాడి జరిగిన నేపథ్యంలో.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైలెంట్గా ఉండటం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పేర్కొన్నారు.
ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తనపై చేసిన దాడిని ఆ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ శుక్రవారం తీస్ హజరీ కోర్టులో వివరించారు. మలివాల్ ఇచ్చిన స్టేట్మెంట్ను కోర్టులో సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ రికార్డు చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్జప్తి చేశారు. గురువారం లఖ్నవూలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేజ్రీవాల్తోపాటు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆప్ నేత సంజయ్ సింగ్ పాల్గొన్నారు.