Share News

CBI: కోల్‌కతా చేరుకున్న సీబీఐ.. వైద్యురాలిపై హత్యాచారం కేసులో దర్యాప్తు

ABN , Publish Date - Aug 14 , 2024 | 11:03 AM

పశ్చిమ బెంగాల్‌ కోల్‌కతా(Kolkata)లోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో వైద్యారాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో సీబీఐ(cbi) దర్యాప్తు ప్రారంభించింది. సీబీఐ ఈ కేసులో ఇప్పటికే కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, తాజాగా ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ నుంచి సీబీఐ బృందం కోల్‌కతా చేరుకుంది.

CBI: కోల్‌కతా చేరుకున్న సీబీఐ.. వైద్యురాలిపై హత్యాచారం కేసులో దర్యాప్తు
cbi

పశ్చిమ బెంగాల్‌ కోల్‌కతా(Kolkata)లోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో సీబీఐ(cbi) దర్యాప్తు ప్రారంభించింది. సీబీఐ ఈ కేసులో ఇప్పటికే కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, తాజాగా ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ నుంచి సీబీఐ బృందం కోల్‌కతా చేరుకుంది. ఢిల్లీ నుంచి సీబీఐ ప్రత్యేక వైద్య, ఫోరెన్సిక్ బృందాన్ని పంపించింది. కోల్‌కతా చేరుకున్న తర్వాత బృందం మొదట న్యూ టౌన్ రాజర్‌హట్‌కు చేరుకుని BSF సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ అధికారులను కలుసుకున్నారు. ఈ క్రమంలో వీరు హత్య కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించి నివేదికను ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు సమర్పించనున్నారు.


ఆదేశాలు జారీ

ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు(high court) నిన్న ఆదేశాలు జారీ చేసింది. కలకత్తా హైకోర్టు ఆదేశించిన కొద్ది గంటల్లోనే ఏజెన్సీ అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన పత్రాలను కేంద్ర దర్యాప్తు సంస్థకు అందజేయాలని రాష్ట్ర పోలీసులను కోర్టు ఆదేశించింది. కేసు డైరీని బుధవారం ఉదయం 10 గంటలలోపు సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర పోలీసులకు హైకోర్టు తెలిపింది. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక మెడికల్ కాలేజ్, ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది విధులను బహిష్కరించి సమ్మె చేపట్టారు. ఈ క్రమంలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


తల్లిదండ్రులు

కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్‌జీ కర్ హాస్పిటల్ ఆడిటోరియంలో అత్యాచారం, హత్యకు గురైన పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ మృతదేహాన్ని శుక్రవారం ఉదయం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో శనివారం ఒకరిని అరెస్టు చేశారు. ఈ కేసును కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితురాలి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. దీంతోపాటు సీబీఐ దర్యాప్తునకు కూడా డిమాండ్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి.


పోస్టుమార్టం నివేదికలో

ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో మృతురాలిపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు తేలింది. బాధితురాలి కళ్లు, నోరు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తం కారుతున్నట్లుగా రిపోర్ట్ వచ్చింది. దీంతోపాటు ఆమె ఎడమ కాలు, మెడ, కుడి చేయి, పెదవులపై కూడా గాయాలయ్యాయి.


నిందితుడు

ఈ కేసులో కోల్‌కతా పోలీసులు 33 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. అతను 2019లో కోల్‌కతా పోలీస్‌లో పౌర వాలంటీర్‌గా చేరాడు. నిందితుడు శిక్షణ పొందిన బాక్సర్, అతను గత కొన్నేళ్లుగా కొంతమంది సీనియర్ పోలీసు అధికారులతో సన్నిహితంగా ఉన్నాడు. దీని తరువాత అతను కోల్‌కతా పోలీస్ వెల్ఫేర్ బోర్డ్‌కు బదిలీ చేయబడ్డాడు. ఆ తర్వాత RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పోలీసు పోస్ట్‌లో పోస్ట్ చేయబడ్డాడు.


ఇవి కూడా చదవండి:

Rain Alert: ఐఎండీ రెయిన్ అలర్ట్.. ఈ 17 రాష్ట్రాలకు హెచ్చరిక


Droupadi Murmu: 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం


సెబీ చీఫ్‌, అదానీపై.. 22న దేశవ్యాప్త ఉద్యమం

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 14 , 2024 | 11:43 AM