Share News

Ravindra Jadeja: బీజేపీలో చేరిన స్టార్ క్రికెటర్.. ఫొటో షేర్ చేసిన రివాబా

ABN , Publish Date - Sep 05 , 2024 | 05:07 PM

ఇండియన్ స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా గురువారం భారతీయ జనతా పార్టీలో చేరారు. అందుకు సంబంధించిన ఫొటోను ఆయన భార్య, బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజా సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనతోపాటు తన భర్త రవీంద్ర జడేజా బీజేపీలో సభ్యత్వ నమోదు కార్డు తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

 Ravindra Jadeja: బీజేపీలో చేరిన స్టార్ క్రికెటర్.. ఫొటో షేర్ చేసిన రివాబా

గాంధీనగర్, సెప్టెంబర్ 05: ఇండియన్ స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా గురువారం భారతీయ జనతా పార్టీలో చేరారు. అందుకు సంబంధించిన ఫొటోను ఆయన భార్య, బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజా సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనతోపాటు తన భర్త రవీంద్ర జడేజా బీజేపీలో సభ్యత్వ నమోదు కార్డు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. 2019లో రివాబా బీజేపీ చేరారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంటే.. 2022లో గుజరాత్‌లోని జామ్ నగర్ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు.

Anam Venkata Reddy: ‘రోజక్కకి ఇంకా సిగ్గు రాలేదు’


జూన్‌లో టీ 20కి రిటైర్మెంట్

ఇక ఈ ఏడాది జూన్‌లో జరిగిన టీ 20 వరల్డ్ కప్ -2024 దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించింది. ఆ కొద్ది గంటకే తాను అంతర్జాతీయ టీ 20 క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రవీంద్ర జడేజా ప్రకటించారు.

Hyderabad: జూబ్లీహిల్స్‌లో పలు రెస్టారెంట్లపై దాడులు.. కేసులు నమోదు


సెప్టెంబర్ 2 నుంచి సభ్యత్వ నమోదు..

సెప్టెంబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా న్యూఢిల్లీలో ప్రారంభించారు. పార్టీలో తొలి సభ్యత్వాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీసుకోవడం ద్వారా ఆయన తన సభ్యత్వాన్ని రెన్యువల్ చేయించుకున్నట్లు అయింది. నాడు ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగనుంది.

Vinayaka Chavithi Special 2024: ముస్లిం దేశాల్లో పూజలందుకొంటున్న ‘గణపతి’


అద్వానీ నివాసానికి జేపీ నడ్డా

తాజాగా ఈ రోజు ఉదయం బీజేపీ సీనియర్ నాయకుడు, భారతరత్న ఎల్ కె అద్వానీ నివాసంలో ఆయనకు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సభ్యత్వ నమోదు కార్డు అందజేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను జేపీ నడ్డా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 05 , 2024 | 05:08 PM