Share News

Delhi : దేశ వ్యాప్తంగా కులగణన అవసరం

ABN , Publish Date - Jul 21 , 2024 | 05:12 AM

దేశ వ్యాప్తంగా కులగుణన చేపట్టాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ(రామ్‌ విలాస్‌) అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ అభిప్రాయపడ్డారు.

Delhi : దేశ వ్యాప్తంగా కులగణన అవసరం

  • కానీ సమాచారాన్ని బహిర్గతంచెయ్యకూడదు: చిరాగ్‌ పాశ్వాన్‌

న్యూఢిల్లీ, జూలై 20: దేశ వ్యాప్తంగా కులగుణన చేపట్టాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ(రామ్‌ విలాస్‌) అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ అభిప్రాయపడ్డారు. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాల రూపకల్పనలో ఈ కులగణన ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని అన్నారు.

అయితే, ప్రజల్లో అసమానతలు చెలరేగే అవకాశం ఉన్న నేపథ్యంలో కులగణన వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయకూడదని సూచన చేశారు. బిహార్‌లో తాము ఇప్పటికే కుల గణన చేపట్టామని, దేశ వ్యాప్తంగా ఆ కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉందని పాశ్వాన్‌ చెప్పారు. కులాల ప్రాతిపదికన కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. అందువల్ల ఏ కులానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారనే సమాచారం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు.

Updated Date - Jul 21 , 2024 | 05:14 AM