Share News

Delhi : 2020లో భారత్‌లో కొవిడ్‌ కల్లోలం!

ABN , Publish Date - Jul 21 , 2024 | 05:08 AM

కొవిడ్‌ మహమ్మారి కారణంగా 2020లో భారత్‌లో లక్షలాది మంది మరణించారని అంతర్జాతీయ పరిశోధన నివేదిక వెల్లడించింది. 2019తో పోలిస్తే 2020 కొవిడ్‌ సమయంలో భారత్‌లో 17ు ఎక్కువగా అంటే.. 11.9 లక్షల మంది అధికంగా చనిపోయారని తెలిపింది.

Delhi : 2020లో భారత్‌లో కొవిడ్‌ కల్లోలం!

  • అదనంగా 11.9 లక్షలమంది మృతి

  • అంతర్జాతీయ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 20: కొవిడ్‌ మహమ్మారి కారణంగా 2020లో భారత్‌లో లక్షలాది మంది మరణించారని అంతర్జాతీయ పరిశోధన నివేదిక వెల్లడించింది. 2019తో పోలిస్తే 2020 కొవిడ్‌ సమయంలో భారత్‌లో 17ు ఎక్కువగా అంటే.. 11.9 లక్షల మంది అధికంగా చనిపోయారని తెలిపింది. ఆ ఏడాది దేశంలో అధికారిక కొవిడ్‌ మరణాల సంఖ్య కంటే 8 రెట్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా కంటే 1.5 రెట్లు ఈ సంఖ్య ఎక్కువని పేర్కొంది.

బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీతో పాటు పలు యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 డేటాను విశ్లేషించి పరిశోధకులు నివేదిక రూపొందించారు. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ దీన్ని కొట్టి పారేసింది. లోపభూయిష్టమైన పద్ధతిలో చేసిన ఈ అధ్యయనం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నుంచి సేకరించిన సమాచారాన్ని మొత్తం దేశానికి ఆపాదించలేమంది. దేశంలో సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ విశ్వసనీయమైనదని, దీనిప్రకారం 2019లో కంటే 2020లో 4,74,000 మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపింది.

Updated Date - Jul 21 , 2024 | 05:08 AM