Share News

Delhi : పాలిస్తూనే ప్రాణం తీసింది!

ABN , Publish Date - Sep 02 , 2024 | 03:04 AM

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని నవజాత శిశువును కన్న తల్లే చంపేసింది. నాలుగో సంతానంగా మళ్లీ ఆడపిల్లే పుట్టడంతో ఆ వివాహిత(28) పాలిస్తూనే ఆ శిశువును గొంతు నులిమి ప్రాణం తీసిందని పోలీసులు తెలిపారు.

Delhi : పాలిస్తూనే ప్రాణం తీసింది!

  • నవజాత శిశువును గొంతు నులిమి చంపిన తల్లి

  • నాలుగో సంతానమూ ఆడపిల్ల కావడంతోనే.. దారుణం

  • తల్లిపై హత్య కేసు నమోదు.. ఢిల్లీలో ఘటన

న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని నవజాత శిశువును కన్న తల్లే చంపేసింది. నాలుగో సంతానంగా మళ్లీ ఆడపిల్లే పుట్టడంతో ఆ వివాహిత(28) పాలిస్తూనే ఆ శిశువును గొంతు నులిమి ప్రాణం తీసిందని పోలీసులు తెలిపారు. ఆ చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తల్లిపై హత్య కేసు నమోదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఆరు రోజుల వయసున్న ఆడ శిశువు కనిపించడంలేదని పశ్చిమ ఢిల్లీలోని ఖ్యాలా పోలీసు స్టేషన్‌కు శుక్రవారం ఉదయం ఫోన్‌ వచ్చింది. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. తల్లితో మాట్లాడగా.. రాత్రి తన బిడ్డకు పాలిచ్చిన తర్వాత పక్కనే పడుకోబెట్టుకున్నానని, లేచి చూసే సరికి తన పాప పక్కన లేదని పేర్కొంది. పోలీసులు సీసీటీవీ కెమెరాలతో పాటు చుట్టుపక్కల ఇళ్ల వద్ద తనిఖీలు చేపట్టగా సమీపంలోని ఓ ఇంటి పైకప్పుపై సంచిని గుర్తించారు. అందులోనే ఆ శిశువు విగతజీవిగా పడి ఉంది. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు పోయినట్టు వైద్యులు తెలిపారు. తల్లి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో ఆమెను పోలీసులు ప్రశ్నించారు. దీంతో తానే తన బిడ్డను చంపినట్టు ఒప్పుకుంది.

Updated Date - Sep 02 , 2024 | 03:04 AM