Share News

Delhi : సోనియాను కలిసిన బంగ్లా ప్రధాని

ABN , Publish Date - Jun 11 , 2024 | 03:37 AM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా సోమవారం కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాధ్రాలను కలుసుకొన్నారు. ఈమేరకు కాంగ్రెస్‌ పార్టీ ‘ఎక్స్‌’లో వెల్లడించింది. బంగ్లా ప్రధాని వారిని కలిసిన చిత్రాలను కూడా ‘ఎక్స్‌’లో ఉంచింది.

Delhi : సోనియాను కలిసిన బంగ్లా ప్రధాని

న్యూఢిల్లీ, జూన్‌ 10 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా సోమవారం కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాధ్రాలను కలుసుకొన్నారు. ఈమేరకు కాంగ్రెస్‌ పార్టీ ‘ఎక్స్‌’లో వెల్లడించింది. బంగ్లా ప్రధాని వారిని కలిసిన చిత్రాలను కూడా ‘ఎక్స్‌’లో ఉంచింది. గాంధీల కుటుంబానికి బంగ్లా ప్రధాని కుటుంబానికి సుదీర్ఘ అనుబంధం ఉంది. షేక్‌ హసీనా తండ్రి.. బంగ్లాదేశ్‌ పిత షేక్‌ ముజిబుర్‌ రహ్మాన్‌కు దివంగత భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో ఎంతో స్నేహం ఉండేది. బంగ్లా విముక్తికి జరిగిన 1971 యుద్ధంలో ఇందిర కీలక పాత్ర పోషించారు. కేంద్రమంత్రి ఎస్‌. జయశంకర్‌ కూడా బంగ్లాదేశ్‌ ప్రధానిని కలిశారు.

Updated Date - Jun 11 , 2024 | 03:37 AM